Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బన్నీని బోల్తా కొట్టించిన వినాయక్ చరణ్ ని ‘మెరి’పిస్తాడా...!?
ఆరెంజ్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకడు ధరణితో 'మెరుపు" అనే సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా కమిట్ అయిన ఈ చిత్రం దాదాపు మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆరెంజ్ ఊహించని రీతిలో ప్లాప్ కావడం, ఈ సినిమాకి భారీ రేంజ్ లో బడ్జెట్ ఎస్టిమేట్ కావడంతో చరణ్ రిస్క్ ఎందుకని ఈ సినిమాని పక్కన పెట్టి సంపత్ నందితో 'రచ్చ" సినిమాకి కమిట్ అయ్యాడు.
దీంతో ఈ సినిమా నుండి దర్శకుడు ధరణి, హీరోయిన్ కాజల్ ఇద్దరూ తప్పుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో రామ్ చరణ్ 'మెరుపు" ఆగిపోలేదని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో దాదాపు అటకెక్కేసిందనుకున్న ఈ సినిమాపై మళ్ళీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర కథకి మరికొన్ని మాస్ హంగులు అద్ది కమర్షియల్ దర్శకుడు వివి వినాయక్ దర్శక్వంలో వహించబోతున్నాడని తెలుస్తుంది. వచ్చే నెలలోనే సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన డేట్స్ ను ఎడ్జస్ట్ చేసుకుంటున్నాడట. మరి అల్లు అర్జున్ ని బోల్తా కొట్టించిన వినాయక్ కనీసం చరణ్ నైనా మెరిపిస్తాడేమో చూడాలి..