Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లు అర్జున్ ని కంగారుపెడ్తున్న రామ్ చరణ్
రామ్ చరణ్ కి ఇప్పుడు కొత్త బెంగ పట్టుకుంది. తామే మొదట మల్టి స్టారర్ సినిమా చేద్దామనుకుంటే అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ మొదలైపోయింది. మరో ప్రక్క నాగచైతన్య, ఎన్టీఆర్ కలసి గుండమ్మ కథ రీమేక్ చేస్తామని మరో మల్టి స్టారర్ కి తెర లేపుతామంటున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ తానూ కలిసి చరణ్-అర్జున్ చిత్రం చేద్దామకున్న ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవటం రామ్ చరణ్ ని నిరాశపరుస్తోంది. అందుకోసం కథ రెడీ చెయ్యమని రైటర్స్ కి చెప్పినా రెడీ చెయ్యకపోవటం,ఇద్దరు ముగ్గురు చెప్పిన కథలు అల్లు అర్జున్ కి నచ్చకపోవటంతో అల్లు అర్జున్ ని కంగారు పెట్టి త్వరగా ఓకే చెయ్యమని చెప్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకూ వంశీ పైడిపల్లి చిత్రంలో ఈ ఇద్దరూ నటిస్తారని న్యూస్ లు వచ్చాయి కానీ సినిమా వార్త అఫీషియల్ గా దిల్ రాజు ప్రకటించిన దానిలో ఆ న్యూస్ లేదు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ రచ్చ చిత్రం చేస్తున్నారు.
రామ్చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్ చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.