twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనసులేని 'మగధీర'...

    By Staff
    |

    Ram Charan
    చిరంజీవి కొడుకుగా తెరంగేట్రం చేసి, 'మగధీర' చిత్రంతో తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న నటుడు రామ్ చరణ్. తన మొదటి సినిమాలో పేదవాడిగా నటించినా చరణ్ కు పేదవాడి బాధలు అర్థం కానట్టుంది. ఆయన గారు చేసిన నిర్వాకానికి ఓ పేద కుటుంబం రోడ్డున పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం మే 28న జరిగింది.

    ఇంతకీ విశయమేమిటంటే మే 28న చరణ్ తన హోండా సివిక్ కారులో రయ్ మని దూసుకెళ్తూ అటుగా వెళ్తున్న ఓ వృద్ధ దంపతులను ఢీ కొట్టాడంట. దీంతో చేసిన తప్పుకు లెంపలేసుకుని వారిని తీసుకెళ్లి జూబ్లీహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాడట. ఇంతవరకూ బాగానే వుంది కానీ ఆ తర్వాత వారిని ఆ ఆసుపత్రి నుండీ తీసుకెళ్లి ఓ చిన్న ఆసుపత్రిలో చేర్పించాడట. అలాగే వైద్యం నిమిత్తం అయిన 90 వేల రూపాయలకు బదులు 45వేలు మాత్రమే ఇచ్చాడట. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుంటుంబం అప్పులపాలయిందట. ఆరోగ్యం బాగుండి వుంటే రోజూ కూలీ చేసి 250 నుండీ 300 రూపాయలు సంపాదించుకొనే వాళ్లమని, ఇప్పుడున్న అనారోగ్య కారణాల వల్ల అది కూడా లేకుండా పోయిందని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆ దంపతుల కుమారుడు స్పందిస్తూ "తాను చిరంజీవి వీరాభిమానినని, ఈ ఉదంతంతో చిరంజీవి అంటేనే ఒళ్లు మండుతోందని, పేదల కోసం పార్టీ పెట్టానని చెప్పి అని ఇలా పేదల కడుపు కొడితే పుట్టగతులుండవని" ఘాటుగా స్పందించాడు. సినిమాల్లో నటించి బాగా అలవాటయిన ఈ పెద్ద మనుషులకు నిజజీవితంలో మంచి గా నటించడం పెద్ద కష్టం కాదు కదా...!! అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X