Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ నెక్ట్స్ ఖరారు, 'నేను-శైలజ' తర్వాత కమిటైంది ఇదే
హైదరాబాద్: వరస ఫ్లాఫుల తర్వాత హీరో రామ్..నేను శైలజ చిత్రం హిట్ తో ఒడ్డున పడ్డాడు. దాంతో ఇక మళ్లీ ఫ్లాఫుల నాటి పరిస్దితి రిపీట్ కాకూడదనుకుంటున్నారు. ఈ మేరకు ఆయన కథలు వినటం, స్క్రిప్టుల మీద వర్క్ చేయటం చేస్తున్నారు. తాజాగా ఓ దర్శకుడుని ఓకే చేసినట్లు సమాచారం.
ఆ దర్శకుడు మరెవరో కాదు గతంలో రామ్ కు కందిరీగ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వాసు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. 14 బ్యానర్ లో రామ్ డేట్స్ ఉన్నాయి. అక్కడ వాసు కథ చెప్పి అటు నుంచి రామ్ దగ్గరకు వచ్చి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.
నేను శైలజ హిట్ తో రామ్ చేయబోయే తదుపరి చిత్రం బిజినెస్ ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కందిరీగ కాంబినేషన్ అనగానే క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ పరిగణనలకి తీసుకునే రామ్ ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు చెప్తున్నారు.
వాస్తవానికి తన రెండో చిత్రం కూడా రామ్ నే డైరక్ట్ చేయాల్సింది వాసు. అయితే అప్పట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ తో వచ్చిన విభేధాలతో రభస చేసారు. ఆ సినిమా డిజాస్టర్ తో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ నేను శైలజ ని మించే కథతో రామ్ ని ఎప్రోచ్ అయ్యారని అందుకే రామ్ ఇమ్మిడియట్ గా ఓకే చేసాడని అంటున్నారు.