Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ కథ ఇదే!?
రామ్, తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. స్రవంతి రవికిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 1 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ కథ అంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్సో లో ప్రచారమవుతోంది. దాని ప్రకారం...ఇందులో తమన్నా ఆత్మగా కనపించనుంది. ఆ ఆత్మతో ప్రేమలో పడి..రామ్ ఏం చేసాడన్నదే మిగతా కథ అంటున్నారు.
ఫారిన్ వెళ్లిన రామ్ అక్కడ పేయింగ్ గెస్ట్ గా ఒకరింట్లో ఉంటాడు. అక్కడ అతను తమన్నాతో ప్రేమలో పడతాడు. అయితే తర్వాత తెలిసే విషయం ఏమింటంటే...తమన్నా ఓ ఆత్మ. ఆమె ఓ యాక్సిడెంట్ లో కోమాలకి వెళ్లి ఉంటుంది. ఆమె ఆత్మ బయిటకు వచ్చి మన హీరోతో ప్రేమలో పడిందన్నమాట. అది తెలిసిన హీరో షాక్ అవటం ఇంటర్వెల్. ఆ తర్వాత ఆమెను కోమాలోంచి బయిటకు తీసుకుని రావటం,ఆమె యాక్సిడెంట్ కి కారణమైన వాళ్లని మట్టుపెట్టడం ఈ కథలోని కీలకాంసం అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం కధ వింటూంటే ఎవరికైనా హాలీవుడ్ లో వచ్చిన జస్ట్ లైక్ హెవెన్ (2005)అనే చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రమే హిందీలో ఐ సియు (2006) అనే టైటిల్ తో వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడిదే చిత్రాన్ని కొద్దిగ మార్చి తెరకెక్కించారని చెప్తున్నారు. అలాగే తెలుగు చిత్రం రిలీజ్ రోజున ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్బెన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం క్యూట్ రొమాంటిక్ స్టోరీగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలై ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
దర్శకుడు కరణాకరన్ మాట్లాడుతూ..అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా ' ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అన్నారు.
ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ- యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్ఫుల్గా చిత్రీకరించాడని చెప్పారు. అలాగే జెనీవా స్విట్జర్లాండ్లలో షూట్ చేసిన పాటలు హైలెట్గా ఉంటాయని తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.