Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ గోపాల్ వర్మ...రెండు వందల కోట్ల కథ
ఎప్పుడూ ఏదో ఒక సంచలనంగా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా అమ్మ అనే త్రీడీ చిత్రాన్ని హఠాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి నిర్మాతలు లేరని, ఆ నిర్మాతలను పట్టడానికే ఈ ప్రకటన విడుదల చేసాడని తెలుస్తోంది. రక్త చరిత్ర వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చాక కూడా వర్మకి నిర్మాతలు లేకపోవటమేమిటని అన్పించవచ్చు కానీ ఈ అమ్మ చిత్రానికి నిర్మాతలు దొరకటం కష్టమేనంటున్నారు. కారణం ఈ చిత్రం బడ్జెట్టు దాదాపు రెండు వందల కోట్లు అని తెలుస్తోంది. ఏ నిర్మాత అయినా ఒక్క సినిమాపై అంత బడ్జెట్ ఎందుకు పెడతారని అంతా ప్రశ్నిస్తున్నారు. ఇక అమ్మ చిత్రం ఓ ట్రెజర్ హంట్ చిత్రమని, ఇందులో హీరోలు ఉండరని అందరూ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలే ఉంటారని వర్మ మరో ట్విస్టు ఇస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, నసీరుద్దీన్ షా, అర్జున్, జాయేద్ ఖాన్, అభిమన్యుసింగ్, సోనూసూద్, సుబ్బరాజు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తారు.