twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ, మోహన్ బాబు చిత్రం టైటిల్ ఏంటి?

    By Srikanya
    |

    Ram Gopal Varma
    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రీసెంట్ గానే ప్రారంభమై, ఆ మేరకు పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'ఒట్టు' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబదించిన పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్లో జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 26 నుంచి మొదలు కానుంది.

    మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మోహన్ బాబు సైతం ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఊరి పెద్దగా పెద రాయుడు టైపులో ఈ పాత్ర ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యిందని,లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది.

    అలాగే ఈ చిత్రం పూర్తి స్ధాయి కామెడీతో సాగుతుందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. వర్మ గతంలో రూపొందించిన మనీ,అనుకోకుండా ఒక రోజు,క్షణ క్షణం తరహాలో ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, స్టోరీ లైన్ విని వెంటనే మోహన్ బాబు ఈ చిత్రం చేయటానికి ఆసక్తి చూపించారని అంటున్నారు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ కొత్త చిత్రం విషయమై రామ్ గోపాల్ వర్మ నుంచి ఏ విధమైన ప్రకటన లేదు. 2014 జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాసం ఉంది.

    ఇక అయితే ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు.

    మరి అలాంటి దర్శకుడితో విష్ణు సినిమా చేసే ముందు కాస్త ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు. కాగా...'దూసుకెళ్తా' విజయంతో మంచి జోష్ మీద ఉన్న విష్ణు ప్రస్తుతం తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌తో కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో నటిస్తున్నాడు.

    English summary
    Director Ram Gopal Varma is all set to direct collection king Mohan Babu. The film which was launched a few days back will start rolling its regular shooting from 26th of December onwards. Vishnu Manchu is playing an important role in the film and interestingly the movie was titled as ‘’Ottu’’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X