Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వర్మ ‘ఐస్ క్రీం-2’కు సెన్సార్ షాక్
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో 'ఐస్ క్రీమ్-2' చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఎఫ్.సి, భీమవరం టాకీస్ బేనర్లపై తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈచిత్రానికి సంబంధించిన 20 ఫస్ట్ లుక్స్ ఒకేసారి విడుదల చేసి ఆ మధ్య సంచలనం సృష్టించాడు వర్మ.
ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం సెన్సార్కు వెళ్లగా....సినిమాలోని రెండు సాంగులతో పాటు కొన్ని సీన్లు తీసేయాలని సూచించారట. దీంతో కోపోద్రిక్తుడైన వర్మ రివైజింగ్ కమిటీకి వెళ్లాలని భావించినా...తర్వాత తన నిర్ణయం మార్చుకున్నాడని, సదరు సీన్లు రీ షూట్ చేసాడని సమాచారం. ఈ వారం మళ్లీ ఈ సినిమా సెన్సార్కు వెళ్లబోతోంది. సెన్సార్ సర్టిపికెట్ వస్తే నవంబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సారి సెన్సార్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఐస్ క్రీం' చిత్రానికి ఇది సీక్వెల్. ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదని చిత్ర యూనిట్ తెలిపారు.