Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర'తో మరో ప్రయోగం
గతంలో ఇద్దరు మిత్రులు, ఆరాధన, గోరంత దీపం వంటి ఎన్నో చిత్రాలు సినిమాలుగా రిలీజైన తర్వాత నవలా రూపంలో వెలువడ్డాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అదే రూటులో ప్రయాణం చేయనున్నారని సమాచారం. ఆయన తన తాజా చిత్రం రక్త చరిత్రని సినిమా నవల గా రాయించి విడుదల చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ రచయితతో చర్చించి,రోజూ నోట్స్ చెప్తున్నట్లు వినికిడి. ఓ ప్రక్క సునీల్ తో అప్పలరాజు చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమా నవల పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక రక్త చరిత్ర మరో కోణంలోనూ ఓ చరిత్రను సృష్టించనుంది. అది రెండు వారాల గ్యాప్ లో రెండు పార్ట్ లుగా రిలీజ్ అవటం. ఇక ఈ సినిమా నవలని తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులోనూ గత కొంత కాలంగా సాక్షిలో నేను అనే కాలం ద్వారా ఆయన తన అనుభవాలు(బ్లాగ్ తెలుగు రూపం)ను పాఠకులతో పంచుకోవటం, దానికి మంచి రెస్పాన్స్ రావటం ఆయనకీ నవలకు స్పూర్తినిచ్చిందని చెప్తున్నారు.