Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
గోవాకు మకాం మార్చేస్తున్న ఆర్జీవీ: ఆయన వెంటే ఆ ఇద్దరు భామలు!
వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించడంతో పాటు ప్రత్యేకమైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన... ఎవరికీ సాధ్యం కాని రీతిలో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో బాలీవుడ్లోనూ సినిమా అవకాశాలు అందుకున్నాడు. ఇంతటి పేరున్న ఆర్జీవీ.. కొన్నేళ్లుగా వివాదాలతో సహవాసం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన గోవాకు మకాం మార్చేస్తున్నాడట. అది కూడా ఇద్దరు హీరోయిన్లతో కలిసి. ఆ వివరాలు మీకోసం.!
అప్పుడలా.. ఇప్పుడు కొంచెం కొత్తగా
చాలా కాలంగా సినీ రంగంలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. గతంలో ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. చాలా విజయాలను అందుకున్నాడు. కానీ, కొన్నేళ్లుగా ఆర్జీవీ వెరైటీగా ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంచలనం అయిన అంశాలను ప్రధానాంశంగా తీసుకుని సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.
పరిటాల నుంచి పవన్ కల్యాణ్ వరకు
రాంగోపాల్ వర్మ ఇటీవలి కాలంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల కథలతో సినిమా రూపొందిస్తున్నాడు. మాజీ మంత్రి పరిటాల రవి జీవితం ఆధారంగా తీసిన ‘రక్త చరిత్ర' నుంచి వరుసగా ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి సినిమాలు తీశాడు. ఇక, ఇటీవల పవన్ కల్యాణ్ రాజకీయాలపై ‘పవర్ స్టార్' అనే చిత్రంతో ముందుకు వచ్చాడు.
అప్పటి వరకు ఉన్న లెక్కను మార్చి
మిగిలిన దర్శకుల సినిమాలతో పోలిస్తే రాంగోపాల్ వర్మ తీసే వాటికి సెన్సార్ చిక్కులు ఎదురవుతున్నాయి. అంతేకాదు, ఆయన తీస్తున్న సినిమాలపై కొందరు కోర్టులను కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవీ సరికొత్తగా ఆలోచించాడు. ఇందులో భాగంగానే ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓటీటీ ఫ్లాట్ఫాంను ఏర్పాటు చేసుకున్నాడు.
కొత్త బిజినెస్ క్లిక్.. వర్మకు లాభాలు
కరోనా ప్రభావంతో థియేటర్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు అందరూ ఓటీటీ ఫ్లాట్ఫాంల వైపు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాంగోపాల్ వర్మ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘పవర్ స్టార్' వంటి సినిమాలను విడుదల చేసి లాభాలను అందుకున్నాడు. మరిన్ని చిత్రాలనూ లైన్లో పెట్టేశాడు.
ఇద్దరమ్మాయిలతో ఆర్జీవీ ప్రయోగం
వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్న రాంగోపాల్ వర్మ తాజాగా ‘డేంజరస్' అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. లెస్బియన్ మూవీగా వస్తున్న ఇందులో అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా, ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారని తన స్టోరీ థీమ్ చెప్పకనే చెప్పాడు. అలాగే, ఫస్ట్ లుక్నూ వదిలాడు.
గోవాకు మకాం మార్చేస్తున్న ఆర్జీవీ
వివాదాస్పద చిత్రాలతో సంచలనాలకు కేరాఫ్ ఆడ్రెస్గా నిలుస్తున్నాడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలతో పాటు క్రైమ్, అడల్ట్ మూవీలను తీశాడాయన. ఈ క్రమంలోనే అతడు 18+ వారి కోసం ‘డేంజరస్' అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన గోవాకు మకాం మార్చబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
Recommended Video
ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ కోసమే
ఈ సినిమాను రాంగోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నాడట. అందుకోసం హైదరాబాద్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గోవాలో షూటింగ్ చేయాలని భావిస్తున్నాడని సమాచారం. అక్కడి బీచ్లలో ఇద్దరు హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు తెరకెక్కించబోతున్నాడట. అందుకే హీరోయిన్లతో కలిసి గోవాకు పయణమవుతున్నాడని టాక్.