Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో రామ్ ‘ఇస్మార్ట్’ స్కెచ్.. ఆ దర్శకులను వెనక్కి పంపేసి.. డబ్బులు ఇచ్చేశాడట.!
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఫలితంలో మాంచి ఖుషీ మీద ఉన్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. గతంలో కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ, ఈ రేంజ్ హిట్ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. వాస్తవానికి అందుకు తగ్గట్లే రామ్ ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మార్పులు చేసుకున్నాడు. దీంతో సక్సెస్ అయ్యాడు. సరైన సమయంలో వచ్చిన హిట్ను మిస్ యూజ్ చేసుకోకూడదన్న ఉద్దేశ్యంతో తగు జాగ్రత్తలు పడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఆ సీక్వెల్లో నటిస్తాడని ప్రకటన
కొద్దిరోజుల క్రితం తన తదుపరి సినిమా గురించి పూరీ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది. ఎక్కడకు వెళ్లినా ‘ఇస్మార్ట్ శంకర్ 2' ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ సినిమా సీక్వెల్ తీయాల్సిన పరిస్థితి వస్తుందని మేము ముందే ఊహించాం. అందుకే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి, సీక్వెల్ను ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. ఇందుకోసం ‘డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ను ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టాను'' అని ఆయన చెప్పుకొచ్చాడు.
అలాంటి సినిమాలు చేయడట
ఇస్మార్ట్ శంకర్ సినిమా పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ మరో మాస్ సినిమా చేయడానికి సిద్ధంగా లేడన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం అతడిపై మాస్ హీరో అనే ముద్ర పడకూడదనేనట. వరుసగా రెండు సినిమాలు చేస్తే ఆ ప్రమాదం ఉండడంతో, కొన్ని ఫ్యామిలీ, లవ్ బేస్డ్ మూవీస్ చేసి ఆ తర్వాత ఈ సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడని టాక్.
రామ్ ‘ఇస్మార్ట్' స్కెచ్
సినిమాలు చేసే విషయంలో రామ్ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ట్రెండ్కు తగ్గట్లు వెళ్లాలని భావిస్తున్నాడట. అందుకోసం కొత్త దర్శకులకు సైతం అవకాశాలు ఇవ్వాలని రామ్ యోచిస్తున్నట్లు సమాచారం. సరికొత్త, ప్రమోగాత్మక చిత్రాలు చేయడానికి కూడా అంగీకారం తెలుపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి రామ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోడానికి భారీ ప్లాన్లు వేస్తున్నాడట.
ఆ దర్శకులను వెనక్కి పంపేసి.. డబ్బులు ఇచ్చేశాడట
గతంలో తనకు కథలు చెప్పి, అడ్వాన్సులు ఇచ్చిన పలువురు దర్శక, నిర్మాతలకు రామ్ షాకిచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ను సరైన రీతిలో వాడుకోవాలన్న ఉద్దేశ్యంతోనే తన దగ్గరకు వస్తున్న దర్శకులు చెప్పే లైన్ నచ్చకపోతే వెంటనే వెనక్కి పంపించేస్తున్నాడట. అంతేకాదు, ఇప్పటికే తనకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకు సైతం తిరిగి ఇచ్చేశాడని అంటున్నారు.
కిశోర్ తిరుమలతో సినిమా
తనకు ‘నేను శైలజ' వంటి సక్సెస్ను ఇచ్చిన కిశోర్ తిరుమలతో సినిమాను ప్రారంభించబోతున్నాడు రామ్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో అధికారికంగా ప్రారంభం కానుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సినిమా ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన నివేదా థామస్ నటిస్తోంది.