Don't Miss!
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- News వైఎస్ కుటుంబంలో మరోసారి పోటీ ! ఫ్యామిలీని ఒప్పించబోతున్న షర్మిల-తర్వాతే ప్రకటన..
- Sports సన్రైజర్స్కు బ్యాడ్ న్యూస్.. నయా ఆల్రౌండర్ దూరం
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు శుభవార్త.. ఈ సారి జీతాల పెంపు ఎంత శాతమంటే..??
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఇస్మార్ట్ ఎఫెక్ట్.. రామ్ రెడీ అనేశాడట.. మరి శైలజలా ఉంటుందా?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటించారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. గురువారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో రామ్ సహా చిత్ర బృందం ఖుషీగా ఉంది.
ఈ సినిమాలో రామ్ నటనకు, అతడి తెలంగాణ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్లకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే పూరీ కొత్త పాయింట్ను తీసుకొచ్చినప్పటికీ టేకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేసుకుని తీశారనిపిస్తుంది. ప్రస్తుతం అంత పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో 'ఇస్మార్ట్ శంకర్' విజయవంతంగా ప్రదర్శితమవుతుందనడంలో సందేహం లేదు.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' మంచి టాక్ను సొంతం చేసుకోవడంతో.. ఈ యంగ్ హీరో మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమైపోయాడు. ఈ నేపథ్యంలోనే తనకు 'నేను శైలజ' వంటి సక్సెస్ను ఇచ్చిన కిశోర్ తిరుమలతో సినిమాను ప్రారంభించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో అధికారికంగా ప్రారంభం కానుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సినిమా ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని టాక్.
కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన నివేదా థామస్ నటిస్తోంది. ఆగస్టులో పూజా కార్యక్రమాలు జరుపుకుని, సెప్టెంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరపాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలనకుంటున్నారు అనే విషయం మాత్రం తెలియరాలేదు.