twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెకండ్ హ్యాండ్ డైరక్టర్ తో రామ్ ఖరారు...పూర్తి డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రస్తుతం పండుగ చేస్తో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న హీరో రామ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు... ఆ మధ్యన బి.వియస్ రవి నిర్మించిన సెకండ్ హ్యాండ్ చిత్రం దర్శకుడు కిషోర్ తిరుమల. చిత్రం టైటిల్ 'హరి కథ' అని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో హీరో పేరు హరి అని ...అతను కథగా ఈ చిత్రం ఫన్ తో నిండి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం హీరోయిన్ చుట్టూ తిరిగే కిడ్నాప్ డ్రామా అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ చిత్రాన్ని రామ్ సొంత బ్యానర్ లోనే చేయనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది.

    ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

    'దేవదాస్‌', 'జగడం', 'మస్కా', 'కందిరీగ'... ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగాడు. నటన, డ్యాన్సులు, పోరాటాలూ, స్త్టెలింగ్‌.. ఇలా అన్నిటా తనదైన సొంత ముద్ర చూపించుకొన్నాడు. ఇప్పుడు 'పండగ చేస్కో'సినిమాతో మరోసారి వినోదాలు పంచబోతున్నాడు.

    Ram's next with Second Hand Director

    ప్రస్తుతం చేస్తున్న చిత్రం విషయానికి వస్తే..

    రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పండగ చేస్కో' . రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాయకానాయికలు, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు.

    రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా యూనిట్ ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

    ''ఇక్కడ చదివి విదేశాల్లో నాలుగు డాలర్లు సంపాదించుకోవడానికి యువత విదేశాలకు వెళ్లిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో విదేశాల్లో కోట్లు సంపాదించిన ఓ యువకుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తన వారి శ్రేయస్సు కోసం ఎలా పోరాడాడు అనేదే చిత్రం'' అన్నారు కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌.

    రామ్ తో చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు పరుచూరి ప్రసాద్‌.

    చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌.

    English summary
    Hero Ram's next movie with Kishore Tirumal confirmed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X