Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రామ్ సరసన సమంత...టైటిల్ 'ఆకతాయి '
హైదరాబాద్: రామ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేయనుంది. అయితే అది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న పండుగ చేస్తో చిత్రంకి కాదు. రామ్ కొత్తగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 'ఆకతాయి ' చిత్రంకోసం ఆమెను ఖరారు చేసారు. ఆ చిత్రాన్ని మల్లిడి వేణు డైరక్ట్ చేయనున్నారు. గతంలో నటుడుగా చేసిన వేణు ఈ సారి దర్సకుడుగా మారి ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నాడు. కథ విన్న రామ్ ఇంప్రెస్ అయ్యి వెంటనే డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ కు వెళ్లే అవకాసం ఉంది.
మరో ప్రక్క గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రంలో హన్సికను హీరోయిన్ గా ఎంపిక చేసారు. రామ్, హన్సిక కాంబినేషన్లో ఇది మూడో చిత్రం కావడం గమనార్హం. ఇదివరకు ఆ ఇద్దరూ 'మస్కా', 'కందిరీగ' చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' పేరును ఖరారు చేశారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది.
దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ "డాన్ శీను, బాడీగార్డ్, బలుపు వంటి హిట్ చిత్రాల తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రామ్ బాడీ లాంగ్వేజ్కి తగినట్లుగా హీరో క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా తయారయ్యే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' టైటిల్ వంద శాతం సరిగ్గా సరిపోతుంది. 'సింహా' వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన బేనర్లో సినిమా చెయ్యడం ఆనందంగా ఉంది'' అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ''అమెరికాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నాం. రామ్కి తగ్గట్టుగా హుషారైన కథని తయారు చేశారు గోపీచంద్ మలినేని. తమన్ స్వరాలందిస్తారు'' అన్నారు. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ సమర్పణలో యునెటైడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఏప్రిల్లో చిత్రీకరణ ప్రారంభిస్తామనీ, మేలో అమెరికాలో ఓ భారీ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాత కిరీటి చెప్పారు.