Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగా హీరోయిన్ హనీమూన్ ఖరీదు కోటి రూపాయలు...!?
ఆ ఒక్కటీ అడక్కు చిత్రం ద్వారా ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో తెలుగులో పరిచయమైన హీరోయిన్ రంభ ఆ తర్వాత అగ్రహీరోల చిత్రాల్లో నటించింది. ఆ పిమ్మట హిందీవైపు మళ్లింది. దివ్యభారతి పోలికలతోపాటు అందాలు కూడా పుష్కలంగా కనువిందు చేయడంతో కొంతకాలం నెట్టుకొచ్చింది.
అలా సంపాదించిన డబ్బుతో 'త్రీ రోజెస్' అనే తమిళ చిత్రాన్ని నిర్మించింది. ఆ మూడు గులాబీల చిత్రం రంభ ఆర్థిక పరిస్థితిని గుచ్చి గుచ్చి పెట్టడంతో పైసలు ఖాళీ అయిపోయాయ్. దీంతో సినీ నిర్మాణానికి స్వస్తి చెప్పి మళ్లీ కోలీవుడ్, టాలీవుడ్ లలో ఛాన్సులకోసం పాకులాడింది. అయితే ఈ రెండు పరిశ్రమలు పొమ్మని చెప్పడంతో భోజపురి చిత్రాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అక్కడా అనుకున్నంతగా అవకాశాలు తలుపు తట్టక పోవడంతో ఇటీవలే కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకున్నది. పెళ్లయిన తర్వాత రంభ దంపతులిద్దరూ ఫిజీ దేశానికి హనీమూన్ వెళ్లారు. అక్కడ రోజుకు 4 లక్షల రూపాయలు అద్దెతో ఓ భవంతిని తీసుకున్నారు. అలా అక్కడ 14 రోజులు ఎంజాయ్ చేశారు. మొత్తమ్మీద అద్దెతో కలిపి ఇతర వినోద కార్యక్రమాలకు అయిన ఖర్చు వెరసి కోటి రూపాయలుగా తేలినట్లు తెలిసింది.
హనీమూన్ ముగిసిన అనంతరం ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా చెన్నై వచ్చిన రంభ, కెనడాకు వెళ్లకుండా ఓ ప్రముఖ ఛానల్ లో జడ్జి అవతారం ఎత్తటంపై పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఏం చేస్తాం...ఇలా కొరుక్కోవడం మామూలే కదా.