Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రామ్ చరణ్ తో ఆ రీమేక్ చేయాలని చిరంజీవి ఆలోచన
మెగాస్టార్ చిరంజీవి మొన్న సంక్రాంతికి విడుదలై విజయం సాధించిన తమిళ చిత్రం ఆడుకాలం చూసారు. దానిని ఇప్పుడు తన కుమారుడు రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని తన వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్లు మెగా క్యాంప్ నుంచి వినపడుతోంది. కోడి పందాల నేపధ్యంలో సాగే ఈ కథ పక్కా మాస్ మశాలాతో యాక్షన్ ఓరియంటేషన్ తో నడుస్తుంది. తన కుమారుడు ఆరెంజ్ లాంటి చిత్రాల్లో నటించే కన్నా చక్కగా మాస్ హీరోగా ఇలాంటి సినిమాలు చేస్తే ఆ క్రేజే వేరుని ఎలాగయినా ఈ చిత్రం చేయంచాలని చూస్తున్నాట్ట.
ఇక అల్లు అరవింద్..అంతగా నచ్చిన ఈ చిత్రం తమ బ్యానర్ పైనే చేద్దామని రైట్స్ కోసం సంప్రదిస్తున్నారని వినికిడి. రామ్ చరణ్ మాత్రం తన చేస్తాను..చెయ్యను అనే విషయం మాత్రం ఇంకా క్లియర్ చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ మెరుపు చిత్రం చేస్తున్నాడు. ధరణి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తాడు.