Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ కొత్త చిత్రం 'ఆరెంజ్' కొత్త సంగతులు
చరణ్ తేజ..మగధీర అనంతరం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ ఏడు నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. పన్నెండవ తేదీ వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుని అనంతరం మరో పది రోజులు షూటింగ్ కు ముంబయి షిప్ట్ అవుతుంది. ఇది పూర్తయ్యాక కొద్ది పాటి గ్యాప్ తో న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఓ పెద్ద ఎపిసోడ్ చిత్రీకరిస్తారని సమాచారం. వీటి తర్వాత ఆస్ట్రేలియాలో దాదాపు మూడు నెలలు పాటు కంటెన్యూ షెడ్యూల్ ప్లాన్ చేసారు.ఈ తొంభై రోజులకు అరవై మంది వెళతారు. ప్రస్తుతం లొకేషన్ ఎంపికలో భాస్కర్ టీమ్ బిజీగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లో కొంత ప్యాచ్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జెనీలియా చేస్తోంది. అలాగే మరో హీరోయిన్ ని ముంబయి అమ్మాయిని సెలక్ట్ చేసారని అంటున్నారు.
ఇక ఈ చిత్రం సబ్జెక్టు ఇప్పటి వరకూ ఇంకా ఫైనల్ అవలేదని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. అలాగే ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కోసం 350 మందికి పైగా అమ్మాయిలను ఆల్బమ్ లలో చూసారు. ఆ తర్వాత వారిలో డబ్బై మందికి ఇంటర్వూలు నిర్వహించారు. అంతేగాక పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో గెస్ట్ గా అడుదామనే ఆలోచనలో ఉన్నారు. అంతే గాక రామ్ గోపాల్ వర్మతో నాచ్ చిత్రానికి కెమెరా అందించిన కిరణ్ రెడ్డిని ఈ చిత్రానికి తీసుకున్నారు. ఆయన నాచ్ తర్వాత ఏ చిత్రానికీ ఈ ఆరేళ్ళ గ్యాప్ లో చేయకపోవటం విశేషం. ఇవన్నీ ఇలా ఉంటే రామ్ చరణ్ మాత్రం ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ కావాలని..దిల్ చాహతా హై రేంజిలో స్టైలిష్ గా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.