twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మధుశాలినిని కాపీ కొడుతున్న రామ్ చరణ్ !?

    By Srikanya
    |

    రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు రీసెంట్ గా ఓపినింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మీడియా కోసం కొన్ని పోస్టర్స్ ని విడుదల చేయటం జరిగింది. అందులో ఓ పోస్టర్ . రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తున్న డిపార్టమెంట్ చిత్రంలో మధుషాలిని తో వేసిన పోస్టర్ లా ఉండటం అంతటా చర్చనీయాంశమైంది. రెండూ ఒకేరకంగా స్టిల్స్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక
    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది.

    ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు. రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది''అన్నారు.

    English summary
    Ramcharan is gearing up to take off with his new project. This has been titled as ‘Yevadu’ and it is directed by Vamshi Paidipally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X