Don't Miss!
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
20ఏళ్ళ తరువాత మెగాస్టార్ మూవీలో ఆ సీనియర్ హీరోయిన్.. స్పెషల్ రోల్
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తరువాత భవిష్యత్తు ప్రాజక్టులను చాలా స్పీడ్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే మెగాస్టార్ సినిమాలపై కొంతమంది కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ ఆయన మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారట. ముఖ్యంగా మెహర్ రమేష్ తో సినిమా అవసరమా అని సన్నిహితులు కూడా సలహాలు ఇచ్చారట. కానీ చిరు మాత్రం వేదళం స్క్రిప్ట్ ని తెలుగులో మెహర్ రమేష్ డిజైన్ చేసుకున్న విధానం చాలా బావుందని ఒప్పుకున్నాడట.
ఇక మరోవైపు వరుస ఫెయిల్యూర్స్ తో అవకాశాలు లేక సతమతమవుతున్న దర్శకుల్లో వివి.వినాయక్ కూడా ఉన్నాడు. ఆ దర్శకుడికి లూసిఫర్ రీమేక్ బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ విషయాలను పక్కనపెడితే లూసిఫర్ రీమేక్ లో ఒక పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఇద్దరు మిత్రుల సినిమాలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రమ్య కృష్ణ మళ్ళీ కలిసి నటించింది లేదు.
కానీ ఆ మధ్య అంజి సినిమాలో మాత్రం స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల తరువాత రమ్యకృష్ణ, మెగాస్టార్ ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. మళయాళ లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రలోనే రమ్యకృష్ణ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ కి చెందిన కొంతమంది సీనియర్ నటీమణులను అనుకున్నప్పటికి వినాయక్ చివరికి శివగామిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.