Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
20ఏళ్ళ తరువాత మెగాస్టార్ మూవీలో ఆ సీనియర్ హీరోయిన్.. స్పెషల్ రోల్
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తరువాత భవిష్యత్తు ప్రాజక్టులను చాలా స్పీడ్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే మెగాస్టార్ సినిమాలపై కొంతమంది కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ ఆయన మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారట. ముఖ్యంగా మెహర్ రమేష్ తో సినిమా అవసరమా అని సన్నిహితులు కూడా సలహాలు ఇచ్చారట. కానీ చిరు మాత్రం వేదళం స్క్రిప్ట్ ని తెలుగులో మెహర్ రమేష్ డిజైన్ చేసుకున్న విధానం చాలా బావుందని ఒప్పుకున్నాడట.
ఇక మరోవైపు వరుస ఫెయిల్యూర్స్ తో అవకాశాలు లేక సతమతమవుతున్న దర్శకుల్లో వివి.వినాయక్ కూడా ఉన్నాడు. ఆ దర్శకుడికి లూసిఫర్ రీమేక్ బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ విషయాలను పక్కనపెడితే లూసిఫర్ రీమేక్ లో ఒక పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఇద్దరు మిత్రుల సినిమాలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రమ్య కృష్ణ మళ్ళీ కలిసి నటించింది లేదు.
కానీ ఆ మధ్య అంజి సినిమాలో మాత్రం స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల తరువాత రమ్యకృష్ణ, మెగాస్టార్ ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. మళయాళ లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రలోనే రమ్యకృష్ణ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ కి చెందిన కొంతమంది సీనియర్ నటీమణులను అనుకున్నప్పటికి వినాయక్ చివరికి శివగామిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.