Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెళ్లి తరువాత దగ్గుబాటి వారి మల్టీస్టారర్.. కథ కూడా సెట్టయ్యింది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలు ఏ రేంజ్ లో క్లిక్కవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా కుర్ర హీరోలు సీనియర్ హీరోలు కలిసి నటించడానికి సిద్ధమవుతుండడంతో అభిమానుల్లో స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది. ఇక ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న దగ్గుబాటి వారి నుంచి కూడా ఒక మల్టీస్టారర్ వచ్చే ఛాన్స్ ఉందట.
Recommended Video
పెళ్లి పనుల్లో బిజీ..
రానా దగ్గుబాటి మొత్తానికి తన ప్రేయసిని ఎనౌన్స్ చేయడంతో దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యుల మధ్య మాట ముచ్చట కార్యక్రమాలు ముగిశాయి. ఇక నెక్స్ట్ నిశ్చితార్థం వేడుకలకు ప్లాన్ వేస్తున్నారు. వీలైనంత తొందరగానే పెళ్లి చేసుకోవాలని రానా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
నెక్స్ట్ మల్టీస్టారర్..
పెళ్లి పనులు అయిపోయిన తరువాత మరొక స్పెషల్ న్యూస్ తో దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఒక స్పెషల్ మల్టీస్టారర్ కథకు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రానా దగ్గుబాటి, వెంకటేష్ కలిసి మాస్ యాక్షన్ కాన్సెప్ట్ తో ఒకే స్క్రీన్ పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
హిట్టు కథ సెట్టయిందట!
గతంలో రానా దగ్గుబాటి నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో వెంకటేష్ ఒక పాటలో మెరిసిన విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల నుంచి వీరు ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నారు. నిర్మాత సురేష్ బాబు కూడా ఎన్నో కథలు విన్నారు కానీ సెట్టవ్వలేదు. ఇక ఫైనల్ గా ఒక మళయాళం హిట్టు కథ సెట్టయినట్లు టాక్ వస్తోంది.
ఆ సినిమాకు రీమేక్
మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' అనే సినిమాను గత కొంత కాలంగా రీమేక్ చేయాలని కొందరు హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా సురేష్ బాబు ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని తీలుకొని వెంకటేష్ , రానా లతో నిర్మించడానికి సిద్ధమయ్యారని టాక్ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే ఎదో ఒక విధంగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక మల్టీస్టారర్ సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.