Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రానాకు మళ్లీ ఆ కష్టాలు... బాహుబలి రిలీజ్ తర్వాత కూడా...!
బాహుబలి తర్వాత రానా దగ్గుబాటి ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దాంతో జాతీయస్థాయి ప్రాజెక్టులు ఆయన ముందు క్యూ కట్టాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ స్థాయి ఉన్న సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. హాథీ మేరి సాథీ, 1945, హౌస్ఫుల్ 4 లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. బాహుబలి అనంతరం రానా వెండితెర కుదిపేసేంత సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఆయన నటిస్తున్న సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్త మీడియాలో షికారు చేస్తున్నది. ఆ వార్త సారాంశమేమిటంటే..
చారిత్రాత్మక నేపథ్యంతో 1945
చారిత్రాత్మక నేపథ్యంతో 1945 చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో రెజీనా కాసాండ్రా, నాజర్, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు. కే ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు సత్య శివ. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు సమాచారం.
రానా సినిమాకు ఆర్థిక ఇబ్బందులు
1945 చిత్రం దాదాపు సగం పూర్తయిందని, మిగితా 50 శాతం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందనట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఇప్పటికే శ్రీలంక, కోచి, తదితర ప్రాంతాల్లో భారీ వ్యయంతో చిత్రీకరించారు. ఆ తర్వాత నిధుల కొరత ఏర్పడటంతో సినిమా షూటింగ్ను నిలిపివేసినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిధుల వేటలో నిర్మాతలు
ప్రస్తుతం 1945 చిత్ర నిర్మాతలు నిధుల వేటలో ఉన్నారట. మిగితా చిత్రాన్ని పూర్తి చేయడానికి ఫండ్స్ సేకరించే పనిలో ఉన్నారని, మిగితా బడ్జెట్ చేతికందితే సినిమాను మళ్లీ పట్టాలక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. హాథీ మేరి సాథీ చిత్ర షూటింగ్ కొన్ని కారణాల వల్ల సజావుగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ రానా సినిమా ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడమనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దర్శకుడు వేణు ఊడుగుల చిత్రంలో
తెలుగులో రానా ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించే సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయిక. 80వ నాటి దశకంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు కూడా కొందరు నటించనున్నారు. ప్రస్తుతం హౌస్పుల్ 4 చిత్ర షూటింగ్ రానా బిజీగా ఉన్నారని, ఆ తర్వాత వేణు ఊడుగుల చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.