Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాణా నెక్ట్స్ నాగచైతన్య దర్శకుడుతో కన్ఫర్మ్!!
నాగచైతన్యకి ఏమి మాయ చేసావే చిత్రంతో హిట్ ఇచ్చి నిలబెట్టిన గౌతం మీనన్ తన తదుపరి చిత్రాన్ని రాణా తో చేయనున్నారని కన్ఫర్మ్ గా తెలిసింది. ఇందునిమిత్తం చెన్నైలోని ఏవియం స్టూడియోలో ఫోటో షూట్ జరిగింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని, ఇది ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతానే ఎన్నుకున్నారు. ఆమె నిన్న(జూన్ 21) న ఈ ఫొటోషూట్ కి అటెండయింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం జూలై ఆఖరి వారం నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతం మీనన్..సమీరా రెడ్డి ప్రధాన పాత్రలో ఓ ధ్రిల్లర్ రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రం హడావిడిగా ప్రారంభంకావటానికి కారణం సెల్వ రాఘవన్ తో సురేష్ బాబు తలపెట్టిన చిత్రం ఆగిపోవటమేనని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగులో నిర్మిస్తూండగా,తమిళంలో ఓ ప్రముఖ సంస్ధ ఈ చిత్రానికి తమిళ పార్టనర్ గా వ్యవహించనుందని తాజా సమాచారం.