twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణా నెక్ట్స్ నాగచైతన్య దర్శకుడుతో కన్ఫర్మ్!!

    By Srikanya
    |

    నాగచైతన్యకి ఏమి మాయ చేసావే చిత్రంతో హిట్ ఇచ్చి నిలబెట్టిన గౌతం మీనన్ తన తదుపరి చిత్రాన్ని రాణా తో చేయనున్నారని కన్ఫర్మ్ గా తెలిసింది. ఇందునిమిత్తం చెన్నైలోని ఏవియం స్టూడియోలో ఫోటో షూట్ జరిగింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని, ఇది ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతానే ఎన్నుకున్నారు. ఆమె నిన్న(జూన్ 21) న ఈ ఫొటోషూట్ కి అటెండయింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం జూలై ఆఖరి వారం నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతం మీనన్..సమీరా రెడ్డి ప్రధాన పాత్రలో ఓ ధ్రిల్లర్ రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రం హడావిడిగా ప్రారంభంకావటానికి కారణం సెల్వ రాఘవన్ తో సురేష్ బాబు తలపెట్టిన చిత్రం ఆగిపోవటమేనని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగులో నిర్మిస్తూండగా,తమిళంలో ఓ ప్రముఖ సంస్ధ ఈ చిత్రానికి తమిళ పార్టనర్ గా వ్యవహించనుందని తాజా సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X