Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కత్రినా-రణబీర్ బ్రేకప్..ఖరీదు రూ. 21 కోట్లు?
ముంబై: మనం ఇప్పటి వరకు చాలా ఖరీదైన విడాకుల గురించి విన్నాం. లవర్స్ విడిపోవడం కూడా ఖరీదైన వ్యవహారమేనా? అంటే అవుననే నిరూపించారు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. గత కొంత కాలంగా ఇద్దరూ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. వీరి బ్రేకప్ ఎఫెక్ట్ కేవలం వారి పర్సనల్ లైఫ్ మీద మాత్రమే కాదు....ఆర్థిక పరమైన అంశాల మీద కూడా పడిందట.
ఇద్దరూ ప్రేమలో కొంతకాలం మునిగి తేలిన తర్వాత ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. నెలకు రూ. 15 లక్షల అద్దెతో ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాటు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ కపూర్ తన కొత్త ఇల్లు అయిన విల్సన్ అపార్టుమెంటుకు వెళ్లి పోయాడు.
కత్రినాతో కలిసున్న ఇంటి కోసం రణబీర్ కపూర్ రూ. 21 కోట్లు డిపాజిట్ చేసాడట. అయితే ఆ డబ్బు వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఎందుకంటే కత్రినా అదే ఇంట్లో ఉంటోంది.
అయితే ఇద్దరి మధ్య విడిపోయేంత పెద్ద గొడవ ఏం జరిగింది? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే రణబీర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాడితో జీవితాంతం కలిసి ఉండటం కష్టమని కత్రినా భావిస్తున్నట్లు ప్రచారం జరుగున్నా....మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ... ‘రణబీర్ ఒక మాటమీద నిలబడే వ్యక్తి కాదు. తన నిర్ణయాలు ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటాడు. ఓ రిలేషన్ షిప్ కు కమిట్ అయ్యే వ్యక్తిత్వం కాదు' అని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య ‘సం'బంధం తెగిపోయిందనే ప్రచారం జరుగుతోంది.