Don't Miss!
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
మహాసముద్రంలోకి ఎంటర్ అవుతున్న రాశీఖన్నా.. ఇదే జరిగితే!
ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిసాస్టర్ తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలకే కమిట్ అవుతూ కెరీర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే రవితేజ హీరోగా Rx 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి మహాసముద్రం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. మొదట ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా అదితి రావు హైదరీ అనుకున్నప్పటికీ.. చివరకు రాశీఖన్నాను ఫైనల్ చేశారని తెలుస్తోంది.
ఇదే జరిగితే మాస్ మహారాజా రవితేజ, రాశీఖన్నా ముచ్చటగా మూడోసారి జత జతకట్టినట్లు అవుతుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో జోడీ కట్టారు. ప్రస్తుతం రాశి ఖన్నా నాగచైతన్య జోడీగా వెంకీమామ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే స్లిమ్ లుక్ లోకి మారిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో మరో సినిమాలో కూడా అవకాశం పట్టేసింది.