Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహాసముద్రంలోకి ఎంటర్ అవుతున్న రాశీఖన్నా.. ఇదే జరిగితే!
ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిసాస్టర్ తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలకే కమిట్ అవుతూ కెరీర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే రవితేజ హీరోగా Rx 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి మహాసముద్రం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. మొదట ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా అదితి రావు హైదరీ అనుకున్నప్పటికీ.. చివరకు రాశీఖన్నాను ఫైనల్ చేశారని తెలుస్తోంది.
ఇదే జరిగితే మాస్ మహారాజా రవితేజ, రాశీఖన్నా ముచ్చటగా మూడోసారి జత జతకట్టినట్లు అవుతుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో జోడీ కట్టారు. ప్రస్తుతం రాశి ఖన్నా నాగచైతన్య జోడీగా వెంకీమామ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే స్లిమ్ లుక్ లోకి మారిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో మరో సినిమాలో కూడా అవకాశం పట్టేసింది.