Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెరీ ఇంట్రెస్టింగ్: బాలయ్య సినిమాలో ఛాన్స్ పట్టేసిన రష్మీ.. ఆమె వద్దంది ఈమెకు దక్కింది.!
ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. అందంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకుందీ ఈ హాట్ బ్యూటీ. కేవలం బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అవసరం ఉన్నప్పుడు తన అందాలతో కుర్రకారును ఆకర్షించే ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు, తరచూ ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారు మదిని దోచుకుంటోంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలోనే రష్మీ ఓ బంపర్ ఆఫర్ పట్టేసిందని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అక్కడ రష్మీ చాలా బిజీ
యాంకర్ రష్మీ గౌతమ్ బుల్లితెరపై వచ్చే పలు షోలతో బిజీగా ఉంటోంది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో కూడా మెరుస్తుంది. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే
రష్మీ.. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం అందని ద్రాక్షలానే ఉండిపోయింది. అయితే, ‘గుంటూరు టాకీస్' అనే సినిమాను మాత్రం తన గ్లామర్తోనే నిలబెట్టింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమా మినహా ఆమెకు అంతగా పేరు తెచ్చినవి లేవనే చెప్పాలి.
సుధీర్తో ప్రేమాయణం.. పెళ్లి
బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్', ‘ఢీ' షోలకు యాంకరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది రష్మీ గౌతమ్. ఈ రెండింటిలో సుడిగాలి సుధీర్ కూడా ఉండడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొంత మంది అయితే రష్మీ - సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అన్నారు. దీంతో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది.
బాలయ్య సినిమాలో అవకాశం
తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ సినిమాలో ఆమెకు అవకాశం దక్కిందనేదే ఆ వార్త సారాంశం. అది కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర అని సమాచారం. ఈమె పాత్ర సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు.
ఆమె వద్దనుకున్నది ఇదేనా
ఇటీవల ఇదే సినిమాలో మరో యాంకర్ అనసూయ నటిస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు అదే పాత్ర కోసం రష్మీని తీసుకున్నారని అంటున్నారు. దీంతో అనసూయ వద్దనుకున్న పాత్ర రష్మీకి దక్కిందనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి అనసూయ ప్రస్తుతం పలు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Recommended Video
ఆ ఒక్క డైలాగుతో చెప్పేశారు
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కే సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం' అంటూ పవర్ఫుల్ డైలాగు చెప్పి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఒక్క డైలాగుతో సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేశారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.