Don't Miss!
- News బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా కొడుతున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports సర్ఫరాజ్, ధ్రువ్కు బీసీసీఐ బంపర్ ఆఫర్
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సమంత భర్తతో రష్మిక మందన్న.. అంతా సస్పెన్స్! ఏం జరుగుతోందంటే..
టాలీవుడ్ చిత్రసీమలో రష్మిక మందన్నకు స్పెషల్ క్రేజ్ ఉంది. అందరు హీరోయిన్లకు తాను భిన్నం అన్నట్లుగా క్లీవేజ్కి దూరంగా ఉంటూ గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఛలో అంటూ తెలుగు సినిమా గడప తొక్కిన ఈమె గీతగోవిందం సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య కూడా రష్మిక మందన్న క్యూలో ఉన్నాడట.
నాగచైతన్య జోష్.. భార్య సమంతతో
గతంలో కాస్త తడబాటుకు లోనైనా ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. ఇటీవలే భార్య సమంతతో 'మజిలీ' రూపంలో సూపర్ డూపర్ హిట్ తన ల్హాటలో వేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఓ వైపు వెంకటేష్తో 'వెంకీమామ' సినిమాలో నటిస్తూనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోమరో సినిమా చేస్తున్నాడు చైతూ.
ఇంతలో రష్మిక పేరు బయటకురావడం
ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న వెంకీమామ, శేఖర్ కమ్ముల చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. శేఖర్ కమ్ముల- నాగచైతన్య కాంబోలో వస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇంతలో రష్మిక మందన్నతో నాగచైతన్య కొత్త సినిమా చేస్తున్నాడని పేర్కొంటూ ఆ టైటిల్ కూడా రివీల్ కావడం అందరిలో ఆసక్తి రేకెత్తించింది.
సస్పెన్స్లో పెట్టిన రష్మిక.. హాట్ టాపిక్
నాగ చైతన్య, దిల్ రాజు కాంబోలో రూపొందనున్న ఈ సినిమాకు 'అదే నువ్వు అదే నేను' టైటిల్ పెట్టారని తెలిసింది. కొత్త దర్శకుడు శశి దర్శకత్వం వహించనున్నాడట. అయితే చైతూ సరసన హీరోయిన్ గా నటించేందుకు గాను రష్మిక మందన్నను దర్శక నిర్మాతలు సంప్రదించగా ఆమె తన నిర్ణయాన్ని సస్పెన్స్లో పెట్టిందని సమాచారం. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.
అక్కినేని వారసుడిపై దృష్టి పడేనా..?
ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు,నితిన్ సరసన భీష్మ సినిమాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా నటించనుంది. సో.. ఇంత బిజీ మధ్యలో రష్మిక.. అక్కినేని వారసుడిపై ఎంతమేర దృష్టి పెడుతుందో చూడాలి మరి.