Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సమంత భర్తతో రష్మిక మందన్న.. అంతా సస్పెన్స్! ఏం జరుగుతోందంటే..
టాలీవుడ్ చిత్రసీమలో రష్మిక మందన్నకు స్పెషల్ క్రేజ్ ఉంది. అందరు హీరోయిన్లకు తాను భిన్నం అన్నట్లుగా క్లీవేజ్కి దూరంగా ఉంటూ గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఛలో అంటూ తెలుగు సినిమా గడప తొక్కిన ఈమె గీతగోవిందం సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య కూడా రష్మిక మందన్న క్యూలో ఉన్నాడట.
నాగచైతన్య జోష్.. భార్య సమంతతో
గతంలో కాస్త తడబాటుకు లోనైనా ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. ఇటీవలే భార్య సమంతతో 'మజిలీ' రూపంలో సూపర్ డూపర్ హిట్ తన ల్హాటలో వేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఓ వైపు వెంకటేష్తో 'వెంకీమామ' సినిమాలో నటిస్తూనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోమరో సినిమా చేస్తున్నాడు చైతూ.
ఇంతలో రష్మిక పేరు బయటకురావడం
ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న వెంకీమామ, శేఖర్ కమ్ముల చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. శేఖర్ కమ్ముల- నాగచైతన్య కాంబోలో వస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇంతలో రష్మిక మందన్నతో నాగచైతన్య కొత్త సినిమా చేస్తున్నాడని పేర్కొంటూ ఆ టైటిల్ కూడా రివీల్ కావడం అందరిలో ఆసక్తి రేకెత్తించింది.
సస్పెన్స్లో పెట్టిన రష్మిక.. హాట్ టాపిక్
నాగ చైతన్య, దిల్ రాజు కాంబోలో రూపొందనున్న ఈ సినిమాకు 'అదే నువ్వు అదే నేను' టైటిల్ పెట్టారని తెలిసింది. కొత్త దర్శకుడు శశి దర్శకత్వం వహించనున్నాడట. అయితే చైతూ సరసన హీరోయిన్ గా నటించేందుకు గాను రష్మిక మందన్నను దర్శక నిర్మాతలు సంప్రదించగా ఆమె తన నిర్ణయాన్ని సస్పెన్స్లో పెట్టిందని సమాచారం. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.
అక్కినేని వారసుడిపై దృష్టి పడేనా..?
ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు,నితిన్ సరసన భీష్మ సినిమాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా నటించనుంది. సో.. ఇంత బిజీ మధ్యలో రష్మిక.. అక్కినేని వారసుడిపై ఎంతమేర దృష్టి పెడుతుందో చూడాలి మరి.