Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ విషయంలో రష్మికపై రూమర్లు.. వెనుకడుగు వేసిన నిర్మాత
పరాయి భాష నుంచి టాలీవుడ్లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక ఇప్పుడు హాట్గా మారింది. పట్టిన సినిమాలు కాసులు వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో వరుస ఆఫర్లు ఆమెను ముంచెత్తుతున్నాయి. ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ. . ఆ తర్వాత గీత గోవిందం, దేవదాసు, డియర్ కామ్రేడ్ చిత్రాలతో రేంజ్ పెంచుకొన్నది. ఇప్పడు ఏకంగా మహేష్ బాబుతో జతకట్టే అవకాశాన్ని దక్కించుకొన్నది. అయితే రష్మిక రెమ్యునరేషన్ విషయంలో ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అదేమిటంటే..
దిల్ రాజు మూవీ గురించి
ఇటీవల దిల్ రాజు రూపొందించే సినిమా కోసం రష్మిక డేట్లను అడిగితే దిమ్మతిరిగిపోయే రెమ్యునరేషన్ చెప్పగా.. అందుకు చిత్ర యూనిట్ సందిగ్ధంలో పడ్డారట. తాజాగా నాగచైతన్యతో ఓ సినిమాను దిల్ రాజు నిర్మించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం డిమాండ్ చేసిన మొత్తంపై సినీ వర్గాల్లో చర్చకు దారి తీసిందనేది తాజా సమాచారం.
రెమ్యునరేషన్ విషయంలో
ఇక తన డిమాండ్కు దిల్ రాజు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆ సినిమాను నుంచి రష్మిక తప్పుకొనేందుకు నిర్ణయం తీసుకొన్నారట. అయితే ఇంతకు ఆమె ఈ సినిమాలో కొనసాగుతుందా లేక ఇంకా చర్చలు జరుపుతున్నారా అనే విషయం మరింత సందేహాలను రేకెత్తించింది. ఈ వార్తపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోవడం గమనార్హం.
వరుస సక్సెస్లతో
తన ఖాతాలో వరుసగా సక్సెస్లు చేరడంతో రెమ్యునరేషన్ పెంచాననే విషయంపై రష్మిక క్లారిటీ ఇచ్చారు. విజయాలు ఉన్నప్పుడే పారితోషికం పెంచకపోతే ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందా అనే ప్రశ్నను ఓ ప్రెస్మీట్లో వేశారు. అయితే తన డిమాండ్ మేరకే రెమ్యునరేషన్ను పెంచానని, అంతేకాని భారీగా ఏ మాత్రం పెంచలేదని విషయాన్ని స్పష్టం చేశారు.
చేతినిండా ప్రాజెక్టులతో
సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు పక్కన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా రష్మిక కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. అలాగే నితిన్తో భీష్మ, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నది. భీష్మ చిత్రం క్రిస్మస్కు రిలీజ్ కానున్నది.