Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరెక్టర్ సెంటిమెంట్.. చైతు పక్కన రష్మిక?
గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు పరుశురామ్. సోలో చిత్రం నుంచి ఆయన తన శైలిని నమ్ముకునే కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ప్రేమ కథలను తెరకెక్కించినా వాటిని కుటుంబ నేపథ్యంలోనే ఉండేట్టు చూసుకోవడం ఈ దర్శకుడి స్టైల్. అందులో భాగంగా విజయ్, రష్మికతో చేసిన గీతగోవిందం బ్లాక్ బస్టర్గా నిలిచింది.
అయితే గీతగోవిందం విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. ఆయన రెడీ చేసుకున్న కథను అటూ ఇటూ తిప్పి చివరకు నాగ చైతన్యను ఒప్పించాడు. ప్రస్తుతం నాగ చైతన్య కూడా బిజీగా ఉన్నా.. పరుశురామ్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయినట్టు టాక్. అందుకే ఆయనకు ఓకే చెప్పాడని సమాచారం.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'నాగేశ్వరరావు' అనే పేరు పెట్టినట్టు టాక్. ఈ మూవీలో చైతన్య పక్కన హీరోయిన్ ఎవరా? అన్న వార్త హల్ చల్ చేస్తోంది. గీత గోవిందం సెంటిమెంట్తో ఈ సినిమాలోనూ రష్మికనే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు టాక్.
మరోవైపు కీర్తి సురేష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. గీతగోవిందం మాదిరిగానే హీరోయిన్కు పాత్రకు ఎక్కువ స్కోప్ ఉందని, అందుకే కీర్తి సురేష్, రష్మికను ఆప్షన్స్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ దృష్ట్యా చైతు పక్కనే రష్మికనే ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.