రష్మిక మందన ఎంగేజ్మెంట్ బ్రేక్.. సంచలన ప్రచారం, కారణం ఇదే!
Recommended Video

ఛలో చిత్రంలో రష్మిక మందన చిలిపి చేష్టలకు యువత ఫిదా అయ్యారు. ఛలో చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు ముందే రష్మిక క్రేజ్ పెరిగిపోతోంది. గీత గోవిందం చిత్ర టీజర్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం రష్మికతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది రష్మిక ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తతం సంచలన ప్రచారం జరుగుతోంది.

డెబ్యూ మూవీతోనే
రష్మిక తెలుగులో నటించిన తొలి చిత్రం ఛలో. నాగశౌర్యతో రొమాన్స్, రష్మిక అల్లరి చేష్టలు ఈ చిత్రంలో యువతకు తెగ నచ్చేశాయి. అదేవిధంగా ఛలో చిత్రం హిట్ కావడంతో రష్మిక బాగా పాపులర్ అయింది.

గీత గోవిందంలో
ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రంలో నటిస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రంలో రష్మిక లుక్ బాగా ఆకట్టుకుంటున్నాయి. గీత గోవిందం చిత్రం యువతకు నచ్చే అంశాలతో రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రష్మిక క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం.

ఎంగేజ్ మెంట్
రష్మిక కన్నడలో నటించిన కిరిక్ పార్టీ చిత్రం ఘనవిజయం సాధించింది. ఏ చిత్రంలో కన్నడ హీరో రక్షిత్, రష్మిక జంటగా నటించారు. ఈ చిత్రంతో వీరిమధ్య ఏర్పడే పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాది రక్షిత్, రష్మిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

బ్రేక్ అప్ అంటూ
రష్మిక గురించి తాజగా సంచలన ప్రచారం మొదలయింది. రక్షిత్, రష్మిక విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తనకు వస్తున్న సినిమా అవాకాశాల దృష్ట్యా రష్మికకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వార్తలు వస్తున్నాయి. కెరీర్ పై దృష్టి పెట్టాలని భావిస్తోందట.

ఫోన్ చేసినా
ఇటీవల రష్మికతో రక్షిత్ ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె స్పందించడానికి ఇష్టపడలేదని వార్తలు వస్తున్నాయి. జరిగిన ఎంగేజ్ మెంట్ ని కూడా రష్మిక పట్టించుకోవడం లేదని అంటున్నారు. వీరిద్దరూ విడిపోయే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











