Rashmika Mandanna: పాపం! రష్మిక మందన్నా.. ఆ హీరో చేసిన పనికి ఇలా..

రష్మిక మందన్నా.. యూత్ గుండెలను క్రష్​ చేసి మరి నేషనల్​ క్రష్​గా ఎదిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ సరసన పుష్ప చిత్రంలో నటించి దేశవ్యాప్తంగా శ్రీవల్లిగా పేరు తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగుతోపాటు కోలీవుడ్​, బాలీవుడ్​లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అంతేకాకుండా పలు అడ్వర్టైజ్​మెంట్​లు కూడా చేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న ఓ సినిమా అర్ధాంత్రంగా ఆగిపోయిందని టాక్ నడుస్తోంది. అందుకు కారణం ఆ మూవీ హీరోనే కారణం అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ ఓ లుక్కేయాల్సిందే!

 కిరిక్​ పార్టీతో..

కిరిక్​ పార్టీతో..

కిరిక్​ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ సినిమా సూపర్​ హిట్​ కావడంతో రష్మికకు కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత నాగశౌర్య సరసన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక. ఈ మూవీలోని చూసి చూడంగానే అనే పాట ఎంత పెద్ద హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కూడా రష్మికకు మంచి గుర్తింపునే తెచ్చింది.

 వరుసగా ఆఫర్లు..

వరుసగా ఆఫర్లు..

అనంతరం రౌడీ హీరో విజయ్​ దేవరకొండతో కలిసి నటించిన గీత గోవిందం సినిమాతో పాపులర్ హీరోయిన్​గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ఆ వెనువెంటనే దేవదాస్, డియర్​ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు , భీష్మ వంటి చిత్రాల్లో నటించి స్టార్​ హీరోయిన్​గా ఎదిగిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ మరొక ఎత్తు.

బన్నీతో రష్మిక కెమిస్ట్రీ..

బన్నీతో రష్మిక కెమిస్ట్రీ..

ఈ మూవీతో రష్మిక మందన్నాకు ఎలాంటి క్రేజ్​ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో బన్నీ డైలాగ్స్​తోపాటు అల్లు అర్జున్, రష్మికల మధ్య కెమిస్ట్రీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక శ్రీవల్లిగా రష్మిక మందన్నా అభినయానికి, యాక్టింగ్​, డ్యాన్స్​కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఒక్క సినిమాతో రష్మిక మోస్ట్​ బిజియెస్ట్​ హీరోయిన్​గా మారిపోయింది. ఇక ఇవేకాకుండా విజయ్ దేవరకొండతో రష్మిక లవ్​ ట్రాక్ నడిపిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.

యాక్షన్​ హీరోతో..

యాక్షన్​ హీరోతో..

వీరిద్దరు కలిసి చాలా టూర్​లు వెళ్లినట్లుగా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదంతా ఇలా ఉంటే పుష్పతో వచ్చిన క్రేజ్​తో రష్మికకు బాలీవుడ్​లో సైతం భారీ ఆఫర్స్ వచ్చాయి. అందులో బాలీవుడ్ యంగ్ యాక్షన్​ హీరో టైగర్ ష్రాఫ్​ సినిమా ఒకటి. ఈ మూవీకి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్​ జోహర్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

పారితోషికం తగ్గించుకోవాలని..

పారితోషికం తగ్గించుకోవాలని..

స్క్రూ ఢీలా ఆనే టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ మూవీకి టైగర్ ష్రాఫ్​ రూ. 35 కోట్ల రెమ్యునరేషన్​ తీసుకున్నాడట. ఇందుకోసం అగ్రిమెంట్​ కూడా జరిగిందట. అయితే షూటింగ్​ ప్రారంభం అయ్యాక టైగర్​ను పారితోషికం తగ్గించుకోవాల్సిందిగా కరణ్​ జోహార్​ కోరాడట. ప్రస్తుతం బాలీవుడ్​ ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా రూ. 20 కోట్లు తీసుకు, లాభాల్లో వాటా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట కరణ్​.

రూ. 140 కోట్ల వరకు ఖర్చు!

రూ. 140 కోట్ల వరకు ఖర్చు!

అయితే ఇందుకు టైగర్​ ష్రాఫ్​ ససెమిరా అన్నాడని సమాచారం. దీంతో ఈ సినిమా చిత్రీకరణను నిలిపివేసినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నటీనటుల రెమ్యునరేషన్​తో కలుపుకుని సినిమా నిర్మాణానికి మొత్తంగా సుమారు రూ. 140 కోట్ల వరకు ఖర్చు కానుందట. దీంతో బాలీవుడ్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను బట్టి సినిమా చిత్రీకరణను ఆపినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫిషియల్ స్టేట్​మెంట్ ఇప్పటివరకు రాలేదు. కానీ, టైగర్ చేసిన పనికి పాపం రష్మిక అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X