Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ కాంబినేషన్.. సెట్టయితే అభిమానులకు పండగే
డైరెక్టర్, హీరో కాంబినేషన్ కంటే బెస్ట్ కాంబో మరొకటి ఉండదనే చెప్పాలి. ఇక రవితేజ లాంటి హీరోకు మంచి కామెడి సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దొరికితే ఆ కిక్కే వేరు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మాస్ రాజా నెక్స్ట్ క్రాక్ సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఎందుకంటే డాన్ శీను, బలుపు వంటి సినిమాలా అనంతరం వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడం వలన తప్పకుండా హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అనే సంకేతాలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే రవితేజ మొదటిసారి మారుతితో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు పండగే వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం మరో సినిమాను ఎనౌన్స్ చేయని ఈ దర్శకుడు ఇప్పుడు కథలైతే రెడీ చేసుకున్నాడు గాని ఇంకా నెక్స్ట్ సినిమా హీరోను ఫిక్స్ చేసుకోలేదు.
మొన్నటివరకు గోపిచంద్, రామ్ పోతినేని వంటి హీరోలతో ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాస్ మాహారాజా రవితేజతో స్క్రిప్ట్ లాక్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి. గతంలోనే చాలాసార్లు ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సెట్టయినట్లు మరికొన్ని రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ గాసిప్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.