Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ కాంబినేషన్.. సెట్టయితే అభిమానులకు పండగే
డైరెక్టర్, హీరో కాంబినేషన్ కంటే బెస్ట్ కాంబో మరొకటి ఉండదనే చెప్పాలి. ఇక రవితేజ లాంటి హీరోకు మంచి కామెడి సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దొరికితే ఆ కిక్కే వేరు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మాస్ రాజా నెక్స్ట్ క్రాక్ సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఎందుకంటే డాన్ శీను, బలుపు వంటి సినిమాలా అనంతరం వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడం వలన తప్పకుండా హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అనే సంకేతాలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే రవితేజ మొదటిసారి మారుతితో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు పండగే వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం మరో సినిమాను ఎనౌన్స్ చేయని ఈ దర్శకుడు ఇప్పుడు కథలైతే రెడీ చేసుకున్నాడు గాని ఇంకా నెక్స్ట్ సినిమా హీరోను ఫిక్స్ చేసుకోలేదు.
మొన్నటివరకు గోపిచంద్, రామ్ పోతినేని వంటి హీరోలతో ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాస్ మాహారాజా రవితేజతో స్క్రిప్ట్ లాక్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి. గతంలోనే చాలాసార్లు ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సెట్టయినట్లు మరికొన్ని రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ గాసిప్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.