Don't Miss!
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజ అయితే మొత్తానికి 2021 సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. క్రాక్ సినిమా ఆయన కెరీర్ కు మరో బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. రవితేజ పనైపోయింది. ఇక సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్స్ ఎన్నో వస్తున్న తరుణంలో క్రాక్ సినిమాతో వాటికి కౌంటర్ ఇచ్చాడు. మాస్ రాజా చివరగా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ఇక మళ్ళీ చాలా కాలం తరువాత క్రాక్ ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించాడు. ఇక అతను రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు సమాచారం. అయితే మాస్ రాజా కేవలం సీనియర్ దర్శకులనే కాకుండా కొత్త వారితో కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఫైనల్ గా ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న మరో కొత్త అసిస్టెంట్ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అతను మరెవరో కాదు. క్రాక్ సినిమాకు కూడా సహాయక దర్శకుడిగా పని చేసిన గులాబీ శ్రీను. గోపీచంద్ మలినేనితో గత సినిమాల నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్న శ్రీను ఇటీవల రవితేజను మరో మాస్ కథతో మెప్పించిన్నట్లు సమాచారం.
క్రాక్ సినిమా పక్కా మాస్ కమర్షియల్ కావడంతో మళ్ళీ అంతకంటే హై రేంజ్ లో ఉండాలని కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు మాస్ రాజా. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి కొత్త దర్శకుడితో సినిమాను ఎప్పుడు ఎనౌన్స్ చేస్తాడో చూడాలి.