మాస్ మహారాజా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడ్డ క్రాక్!!
మొత్తానికి అనుకున్నదే జరిగింది. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఉత్సాహం మొత్తం నీరుగారిపోయింది. ఎంతో ఆత్రుతతో ఎదురుచూసిన ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు. ఉదయం నుంచి థియేటర్ల వద్ద ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ చేదు వార్త వచ్చింది. ఇప్పటికే మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఇక అఫీషియల్గా వార్తలు బయటకు రాకపోయినా కూడా ఓ విషయం మాత్రం చక్కర్లు కొడుతోంది.
Recommended Video

ఆ వివాదం వల్లే..
క్రాక్ నిర్మాత ఠాగూర్ మధుకి తమిళ సినిమా నిర్మాతల నుంచి అడ్డంకి ఏర్పింది. 'అయోగ్య' చిత్రానికి సంబంధించి సుమారు రూ.10 కోట్ల ఆర్థిక లావాదేవీలపై కోర్టులో కేసు నడుస్తోందట. చెన్నైకి చెందిన నిర్మాణ సంస్థ క్రాక్ సినిమా విడుదలను అడ్డుకుందట. ఠాగూర్ మధు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృథా అయ్యాయని తెలుస్తోంది.

షోలు రద్దు..
అయితే ఉదయం పూట ఈ గందరగోళం నెలకొనడంతో అందరూ అయోమయంలోకి వెళ్లారు. హడావిడిగా మార్నింగ్ షోలను క్యాన్సిల్ చేశారు. మళ్లీ గంటలో షో పున: ప్రారంభం అవుతుందని అన్నారు. కానీ చివరకు మ్యాట్నీ షో కూడా రద్దు చేసే వరకు వచ్చింది.

మొత్తంగా వాయిదా..
ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సినిమా విడుదలే వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే మీడియాకు వేయాల్సిన స్పెషల్ షోలను క్యాన్సిల్ చేసేశారు. ఇక బయట కూడా కొన్ని థియేటర్లలో అధికారికంగా షోలను నేటికి రద్దు చేసినట్టు తెలిపారు. డబ్బును రీఫండ్ చేస్తామని హామీ చేశారు.

సంక్రాంతి బరిలోకి..
ఇక క్రాక్ సినిమా సంక్రాంతి ముందు రోజు వస్తుందని తెలుస్తోంది. జనవరి 13న క్రాక్ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోన్న సమాచారం అందుతోంది. సాయంత్రం వరకు ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే రాత్రి వరకు అన్ని సమస్యలను అధిగమించి నైట్ షోలను వేస్తారా? లేదా రేపటి రిలీజ్ను వాయిదా వేస్తారా? లేదంటే మొత్తంగా ఈ వీకెండ్ను మిస్ చేసుకుంటారా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











