అందుకా నిర్మాత బుజ్జి కొట్టింది!?

ఆ రోజు హైదరాబాద్లోని బిర్లా ఎంపోరియమ్లో జరుగుతున్న రవితేజ చిత్రం షూటింగ్కు పలకరింపుగా నల్లమలుపు బుజ్జి వచ్చారు. ఇక బుజ్జిరాగానే.. గోవర్థన్ క్యాజువల్ గా వచ్చి.. సార్! మీరు తీసిన "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సూపర్గా ఉంది సార్.. మొన్ననే చూశానని చెప్పాడు. దీంతో బుజ్జి షాక్కు గురై... అసలు సినిమానే రిలీజ్ కాలేదు. నువ్వెలా చూశావని, పైరసీ ఎక్కడ జరుగుతోందని చెప్పమంటూ.. కోపంతో చేయిచేసుకున్నాడని సమాచారం. కోట్ల ఖర్ఛు పెట్టి తీసిన సినిమా రిలీజ్ కాకముందే పైరసీ కావటం ఆయనకు షాక్ గురిచేసి ఆ స్ధితిలో చేయిచేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం.అలాగే ప్రస్తుతం కేసును గోవర్థన్ ఉపసంహరించుకునే దశలో ఉన్నారని తెలిసింది.
ఇక సిద్ధార్థ, తమన్నా హీరోహీరోయిన్లుగా కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. డి. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకావాల్సింది. కానీ అప్పటికే సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిత్రాలు విడుదల కావడంతో థియేటర్లు లభించక సినిమా విడుదలను వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications











