Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టెన్షన్ పడుతున్న సాహో టీమ్.. కారణమిదే!
బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్గా ఫేమస్ అయిన హీరో ప్రభాస్.. తన కొత్త ప్రాజెక్టుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆయన యంగ్ డైరెక్టర్ సుజీత్కి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసింది సాహో టీమ్. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్లో విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉంటాయి. ప్రేక్షకులను అబ్బురపరిచేలా విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ మేరకు సాహో టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోందట. అయినప్పటికీ విఎఫ్ఎక్స్ పనులు లేట్ అవుతుండటం టీమ్ని టెన్షన్ పెడుతోందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా ఫైనల్ ఎడిట్ లో భాగంగా విఎఫ్ఎక్స్ మిక్స్ చేసి ఆ కాపీని సెన్సార్ బోర్డుకు పంపాల్సి ఉంటుంది. కానీ విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటం, సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో సాహో టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోందట.
ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా స్టూడియోల చుట్టూ తిరుగుతూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడ్ గా చేసేస్తున్నారట. ఇంకా సాహోకి సంబందించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు కాలేదు.. కాబట్టి అతి త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టి సినిమాపై భారీ హైప్ తీసుకురావాలని సాహో టీమ్ సన్నాహాలు చేస్తోందట. కానీ సమయం తక్కువ కనిపిస్తుండటమే సాహో టీమ్ లో కాస్త టెన్షన్ పుట్టిస్తోందని చెప్పుకుంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో పాలుపంచుకుంటున్నారు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూపు సాహో పై ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించి హై రేంజ్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది చిత్రయూనిట్.