twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ఎందుకు తుస్సుమంటున్నాడు?

    By Staff
    |

    "బాలయ్య బాబు 25 నిమిషాల పాటు కథ విని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" ఇదీ బాలకృష్ణ తాజాగా నటిస్తున్న "సింహా" చిత్రప్రారంభోత్సవం రోజున ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పరుచూరి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. బాలయ్య "మిత్రుడు" సినిమా డైరెక్టర్ మహాదేవ్ కూడా చిత్రప్రారంభోత్సవానికి ముందు దాదాపు ఇలాంటి స్టేట్ మెంటే ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు బాలకృష్ణ చిత్రప్రారంభోత్సవం రోజున సాధారనంగా వినిపించేవే!!

    రెండు మూడు హిట్ సినిమాలు తమ ఖాతాలో చేరగానే దర్శకత్వ విషయాల్లో వేళ్లు పెడుతున్నారని, కథ పూర్తిగా చెప్పాలని, స్ర్కిప్టు సినిమాకు ముందే వినిపించాలని గోంతెమ్మకోర్కెలు కోరుతున్నట్టు విమర్శలెదుర్కొంటున్న యువహీరోలున్న ఈ రోజుల్లో, ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వున్నప్పటికీ దర్శకుణ్ణి పూర్తిగా నమ్మి సినిమాలు చేస్తున్న నటుడిగా బాలయ్యకు మంచి పేరుంది....

    కానీ ఇప్పడదే బాలయ్య కొంప ముంచుతోందంటున్నారు సినీవిమర్శకులు. అసలు బాలకృష్ణ నటించిన "వీరభద్ర" చిత్రంలో ఆయన హెయిర్ స్టయిల్ చాలా ఛండాలంగా వుందని సర్వత్రా విమర్శలు వెల్లవెత్తాయి, కానీ ఆ చిత్రదర్శకుడు ఎ.యస్.రవికుమార్ చౌదరి మాత్రం తానీ చిత్రాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తీసినట్టు, బాలయ్య అభిమానులు ఈ చిత్రం గురించి గర్వంగా చెప్పుకోవచ్చని ఊదరగోట్టేసారు....తీరా సినిమా చూస్తేకానీ తెలియలేదు ఆయన ఏ రేంజ్ లో తీసారో. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదాహరణలు, చివరికి దర్శకేంద్రడు రాఘవేంద్ర రావు కూడా ఇందుకు మినహాయింపు కాదు. "అన్నమయ్య", "శ్రీ రామదాసు" లాంటి భక్తిరస చిత్రాలను ఇచ్చిన రాఘవేంద్ర రావు గారు "పాండురంగడు" పేరుతో "భక్తి తక్కువై, రక్తి ఎక్కువై" ఓ చిన్న సైజు బూతు చిత్రాన్ని ప్రేక్షకులపైకి వదిలారు.

    ఇవన్నీ చూస్తుంటే దర్శకున్ని నమ్మి సినిమాలు చేయడం మంచిదే అయినా తన వైపు నుండీ కూడా కొద్దిగా శ్రద్ద తీసుకొంటే మంచిదంటున్నారు సినీవిశ్లేషకులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X