Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రభాస్ ‘జాన్’ నుంచి షాకింగ్ అప్డేట్: మరోసారి రాజమౌళి సినిమాతో వస్తున్నాడట
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా స్టార్డమ్ దక్కించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా అతడి కెరీర్తో పాటు మార్కెట్ను అమాంతం పెంచేసింది. దీని తర్వాత అతడు నటించిన చిత్రం 'సాహో'. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమా కావడంతో ఇది చర్చనీయాంశం అయింది.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్తో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అతడు మరో సినిమాను స్టార్ట్ చేసేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళితే...
సరికొత్త యాంగిల్ చూపించబోతున్నాడు
‘సాహో' వంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్'. ఈ సినిమాను ‘జిల్' ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది.
ఒక్కరు కాదు ఇద్దరు ప్రభాస్లు
రొమాంటిక్ జోనర్లో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే ఓ వార్త బయటకు వచ్చింది. అందులో ఒక పాత్ర తండ్రిది కాగా, రెండోది కొడుకుదని అంటున్నారు. ప్రభాస్ ‘బాహుబలి'లో కూడా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రిచ్గా ప్రభాస్.. పూర్గా పూజా
ఈ సినిమా 1960వ దశకంలో విదేశాల్లో జరిగే ప్రేమకథతో రూపొందుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈ కథ ప్రకారం ప్రభాస్ ధనవంతుల కుమారుడిగా కనిపిస్తాడట. అదే సమయంలో పూజా హెగ్డే పేదింటి అమ్మాయి పాత్ర చేస్తుందట. ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుందని సమాచారం.
ప్రభాస్ సినిమా నుంచి షాకింగ్ అప్డేట్
తాజాగా ప్రభాస్ ‘జాన్'కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందనేదే ఆ వార్త సారాంశం. 1960ల నాటి ప్రేమకథ విఫలం అవడం.. ప్రస్తుత జనరేషన్లో వాళ్లిద్దరూ మళ్లీ కలవడం వంటి లైన్తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. గతంలో ఇదే లైన్తో పలు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
Recommended Video
రాజమౌళి సినిమాలో చూపించినట్లే..
గతంలో దర్శకధీరుడు రాజమౌళి - మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘మగధీర'. ఈ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలోనే వచ్చింది. ఇందులో చూపించినట్లే రెండు జన్మల ప్రేమకథను ‘జాన్'లో చూపించబోతున్నారట. అందులో ఒకటి విదేశాల్లో జరిగే స్టోరీ కాగా, మరొకటి మన దగ్గర జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.