twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఎన్నార్ కి జంటగా రేఖ ఎంపిక?

    By Srikanya
    |

    హైదరాబాద్ :అక్కినేని త్రయం నటిస్తున్న 'మనం' సినిమాకి కొబ్బరికాయ కొట్టి రెండు రోజుల క్రితం మొదలెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రమిది.

    ఈ చిత్రంలో శ్రియ, సమంత ...నాగార్జున,నాగచైతన్యలకు హీరోయిన్స్ గా చేస్తున్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి అక్కినేని నాగేశ్వరరావు కు జోడిగా ఎవరని తీసుకువస్తారు అనే సందేహం చాలా మందికి కలిగింది. అయితే రేఖను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతన్నట్లు సమాచారం.

    మరో ప్రక్క రోహిణి హట్టంగిడి పేరు కూడా నలుగుతోంది. రేఖ నో చెపితే ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే రేఖను పెడితే క్రేజ్ వేరే రకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వారంలో ఫైనలైజ్ అవుతుందని అంటున్నారు.

    ఇక సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. నాగచైతన్య కెమెరా ముందుకు వచ్చినప్పటి నుంచీ అక్కినేని హీరోలు ముగ్గురూ నటించే చిత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 'ఇష్క్‌' రూపొందించిన విక్రమ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం, పి.ఎస్‌.వినోద్‌ ఛాయాగ్రహణం సమకూరుస్తారు.

    English summary
    The shooting of ANR-Nagarjuna-Naga Chaitanya starrer Manam has just begun in the city. The big question on everybody's mind is who will be paired opposite ANR in the movie. Samantha is paired opposite Naga Chaitanya and Shriya is cast with Nagarjuna. Buzz is that the filmmakers are in a quandary over finding a suitable match for the legendary ANR. Apparently the filmmakers are planning to rope in yesteryear Bollywood diva Rekha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X