Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిర్ణయాన్ని మార్చుకున్న రేణు దేశాయ్.. ఊహించని పరిణామంతో షాక్లో యంగ్ హీరో.!
Recommended Video
రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే కాదు.. ఓ శక్తివంతమైన మహిళగా ఎంతో గుర్తింపును తెచ్చుకుంటున్నారు. పూరీ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలో పవన్తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ఈ మాజీ మోడల్. ఇక, పవర్స్టార్తో విడాకులు తీసుకున్న తర్వాత స్వతంత్ర జీవితం గడుపుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది.
తెలుగులో రీఎంట్రీ
రేణు దేశాయ్ ‘జానీ' సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే, తాజాగా ఆమె టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు వస్తున్నాయి. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ద్వారా ఆమె తెలుగు సినిమాల్లోకి రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా.. ‘దొంగాట' డైరెక్టర్ వంశీ కృష్ణ దీనిని తెరకెక్కించనున్నాడు.
క్లారిటీ ఇచ్చిన రైటర్
రేణు దేశాయ్ రీఎంట్రీ విషయాన్ని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వెల్లడించారు. ఈ సినిమాకు మాటల రచయితగా పని చేస్తున్న ఆయన ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సాయి మాధవ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చిత్ర బృందం సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రేణు దేశాయ్తో సంప్రదింపులు జరిపిందని చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలిపారు.
సినిమా చేయదట
బెల్లకొండ సాయి శ్రీనివాస్ సినిమా ద్వారా రేణు దేశాయ్ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పటికీ, ఆమె ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా చేయకూడదనే విషయాన్ని ఆమె ఫిల్మ్ మేకర్స్కు కూడా వెల్లడించారని సమాచారం. దీంతో యంగ్ హీరో షాక్కు గురయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తప్పుకోడానికి కారణం ఇదేనా?
రేణు దేశాయ్ ఆ సినిమా నుంచి తప్పుకోడానికి కారణం రైతుల సమస్యల గురించి సినిమా చేయాలని భావిస్తుండడమేనని తెలుస్తోంది. త్వరలోనే తెలుగులో రైతు సమస్యలపై ఓ సినిమా చేస్తానని ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆమె డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ కారణంగానే రేణు.. బెల్లంకొండ సినిమా నుంచి తప్పుకున్నారని టాక్.
ఈ సినిమా అయ్యే వరకు హైదరాబాద్లోనే..
రేణు దేశాయ్ తెరకెక్కించనున్న సినిమా అయ్యే వరకు ఆమె హైదరాబాద్లోనే ఉంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె మాత్రమే కాదు.. పిల్లలను కూడా ఇక్కడికే తీసుకొస్తానని చెప్పారు. డైరెక్టర్గా సక్సెస్ అయితే ఇక్కడే ఉండే ఆలోచన చేస్తానని కూడా ఆమె వెల్లడించారు.