Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇదేంటి... రవితేజ పై రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్ : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంపిటేషన్ ని పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా రిలీజ్ ముందు...తర్వాత ఏం సినిమాలు ఉన్నాయో ఆయన చూసుకోరు. దాంతో చాలా సార్లు ఆయన సినిమాలు పెద్ద సినిమాలపై పడటం జరుగి ఎవరూ పెద్దగా పట్టించుకోని సిట్యువేషన్ ఏర్పడుతోంది. ఇప్పుడు మరోసారి అలాగే ఆయన తన తాజా చిత్రం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు.
వర్మ డైరక్షన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా కిల్లింగ్ వీరప్పన్. ఈ సినిమాని, రవితేజ సినిమా బెంగాల్ టైగర్ కి పోటీగా ఒక్క రోజు ముందుగా విడుదల చేస్తారు. డిసెంబర్ 11న కిల్లింగ్ వీరప్పన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండగా, ఆ మర్నాడు డిసెంబర్ 12న బెంగాల్ టైగర్ విడుదల కాబోతోంది.
గతంలో ఇదే విదంగా జరిగింది కాకపోతే ముందుది వేనుకైంది. వెనుకది ముందైంది. అంటే రవితేజ పవర్ తర్వతా వర్మ అనుక్షణం రిలీజ్ అయ్యి ఓటమి పాలైంది.
'కిల్లింగ్ వీరప్పన్' విశేషాలకు వస్తే...
రామ్ గోపాల్ వర్మ తన పట్టపగలు, ఎటాక్ చిత్రాలను ప్రక్కన పెట్టి 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రాన్ని విడుదలకు సిద్దం చేసారు. డిసెంబర్ 11న తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. సందీప్ భరద్వాజ్, శివరాజ్ కుమార్, రాక్లైన్ వెంకటేష్, పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు. బి.వి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, బి.ఎస్.సుధీంద్ర నిర్మాతలు.
వర్మ మాట్లాడుతూ... ''చరిత్రలోనే వీరప్పన్ ఓ అరుదైన వ్యక్తి. వీరప్పన్ కథని సినిమాగా తీయడానికి చాలా పరిశోధన చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని కలుసుకొని కొన్ని విషయాలు సేకరించాను. వాటన్నింటిని క్రోడీకరించి తీసిన సినిమా ఇది. వీరప్పన్ తిరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపాము''అన్నారు.
వర్మ కంటిన్యూ...''వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్ను చంపడం అనే పాయింట్తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా'' అని రామ్గోపాల్ వర్మ అన్నారు.
అలాగే... - ''వీరప్పన్ లైఫ్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్లో షూట్ చేశాం. 'ఆపరేషన్ కుకూన్'లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్కుమార్ తనయుడు శివరాజ్కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. '' అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్చంద్ర