Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వర్మ దర్శకత్వంలో రాణా ‘ఒక్కడు’ రీమేక్
మహేష్ బాబు హీరోగా వచ్చిన 'ఒక్కడు' సినిమా ఆ మధ్య భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి యువ హీరో 'రాణా' ఈ సినిమా రీమేక్ లో నటించాలని చాలా ఆతృతగా ఉన్నాడు. 'దమ్ మారో దమ్' సినిమా ద్వారా ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాణా తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్ మెంట్' చిత్రంలోనూ పవర్ పుల్ రోల్ చే్స్తున్నాడు.
అయితే బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్న రాణా అక్కడ సోలోగా మంచి హిట్ కొట్టి పర్మినెంట్ గా పాగా వేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే 'ఒక్కడు' సినిమా హిందీ రీమేక్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం....ఈ రీమేక్ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నాడని, తన సొంత బ్యానర్ ఆర్.జి.వి ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.