Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఫ్యాక్షన్ గడ్డ' పై వర్మ
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాము తాజాగా ఫ్యాక్షన్ గడ్డ 'అనంతపురం'లో దర్శనమిచ్చారు. అనంతపురం ఎస్పీ యం.కె.సింగ్ తో సమావేశమయ్యారు. ఇదంతా ఎందుకంటే తెలుగు దేశం నేత, ఎమ్మెల్యే దివంగత పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న 'రక్త చరిత్ర' సినిమా షూటింగ్ అనంతపురం జిల్లాలో తీయబోతున్నందున భద్రతా విషయాలరిత్యా సమావేశమయినట్టు తెలిసింది. ఇంతకు ముందు వర్మ పరిటాల రవి భార్య పరిటాల సునీత తోనూ, మద్దెల చెరువు సూరి తో జైల్లోనూ సమావేశమయిన విషయం తెలిసిందే.
వివేక్ ఒబెరాయ్ రవి పాత్రలో, 'గజిని' సూర్య 'మద్దెల చెరువు సూరి' పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'రక్త చరిత్ర 1', 'రక్త చరిత్ర 2' లుగా రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం సర్వత్రా ఆసక్తిరేగిస్తోంది. కాగా ఈ మధ్యనే విడుదలైన వర్మ చిత్రం 'అడవి' పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా ఇవేవీ పట్టించుకోని రాము రక్త చరిత్ర సినిమా పనుల్లో తలమునకలైపోయారు.