Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పోస్టర్ ఖర్చులైనా వస్తాయా?
హైదరాబాద్ : క్వాలిటీ అనేది పట్టించుకోవటం మానేసి,కేవలం క్వాంటిటీ మీదే దృష్టి పెడుతూ,వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా మరో చిత్రం ఎనౌన్స్ చేసి పారేసారు. 'ఐస్క్రీమ్' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసారు. అంతేగాక ఈ చిత్రానికి సంభందించి కొన్ని ఫస్ట్ లుక్ ఫొటోలను విడుదల చేసాడు. అయితే వీటిని చూసినవారు పెదవి విరుస్తున్నారు. అసలే నవదీప్ సినిమాకు మినిమం ఓపినింగ్స్ లేవు. దానికి తోడు శాటిలైట్ సినిమాలు తీసుకునే నిర్మాత రామ సత్యనారాయణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయటం. వర్మ వేగంగా చుట్టేయటం చూస్తూంటే పోస్టర్ ఖర్చులైనా ఈ చిత్రానికి దక్కుతాయా అని సందేహపడుతున్నారు.
విభిన్న కథాంశాలతోనే కాకుండా డిఫరెంట్ టైటిల్స్తో సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'ఐస్క్రీమ్'. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్ హీరో. తేజస్వి హీరోయిన్. సైలెంట్గా రెండు నెలల క్రితం ఈ చిత్రాన్ని ప్రారంభించిన వర్మ నాన్స్టాప్ షెడ్యూల్తో షూటింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే నెల 4న సినిమా విడుదల చేయడానికి నిర్మాత రామసత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు.
టైటిల్కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.