రాణా మొదటి బాలీవుడ్ సినిమానే వివాదంలో ఇరుక్కుపోయింది...
రోహన్ సిప్పీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అభిషేక్, టాలీవుడ్ యంగ్ హీరో లీడర్ రాణా నటించిన తొలి హిందీ చిత్రం 'దం మారో దం' విడుదలకు ముందే ఓ వివాదంలో చిక్కుకుంటోంది. ఆ సినిమా ట్రైలర్స్ లో హీరోయిన్ బిపాషా బసు పలికిన ఓ డైలాగు కుర్రాళ్లకు కిక్కిస్తున్నప్పటికీ, గోవా ప్రజలకు మాత్రం సర్రుమని కాలుతోంది. గోవా బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ చిత్రీకరించారని 'ఇక్కడ మందు చీప్... అమ్మాయిలు మరింత చీప్' అంటూ బిపాషా పలికే ఆ డైలాగు తమను, తమ ప్రాంతాన్నీ అవమానపరిచేదిగా వుందని గోవా ప్రజలు గొడవ చేస్తున్నారు. తమ రాష్ట్రానికి వచ్చి షూటింగులు చేసుకుని, చివరికి తమనే విమర్శిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ డైలాగులు సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదలకు సిద్దమవుతోన్న సందర్బంలో ఈ వివాదం చివరికి ఏమవుతుందో? వేచి చూడాల్పిందే...
More from Filmibeat
abhishek bachchan rana bipasha basu deepika padukone బిపాసా బసు రాణా అభిషేక్ బచ్చన్ దీపికా పదుకొనే కంగనా రౌనత్ రోహన్ సిప్పి


Click it and Unblock the Notifications











