Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ విడుదల తేదీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రం గురించి సినీవర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఇది. సినీవర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలే తప్ప ఈ చిత్రం గురించి అధికారికంగా ఇంకా ఏమీ ప్రకటించలేదు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం విడుదల గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది.
Recommended Video
నవంబర్ నుంచి
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచరణ్ బోయపాటి చిత్రంతో, అరవింద సమేత చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.
2020 సంక్రాంతి
భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా పక్కాగా సిద్ధం చేసుకుని షూటింగ్ అనుకున్న టైంకి పూర్తిచేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నారట.
200 కోట్ల భారీ బడ్జెట్
ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందనుంది. బాహుబలి రెండు భాగాలకు కలిపి రాజమౌళి 200 కోట్లకు పైగా ఖర్చుచేశారు. కానీ ఈ చిత్రం ఒక్కదానికే 200 కోట్లు వెచ్చిస్తుండడంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బాహుబలి స్థాయిని మించేలా ఈ చిత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బలమైన కథతో
ఈ చిత్ర స్థాయికి తగ్గట్లుగా రాజమౌళి బలమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రాంచరణ్ అన్నదమ్ములుగా నటిస్తారని కూడా ఓ వినికిడి. త్వరలో ఏ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియనున్నాయి. డిడివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.