Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెండు కోట్లు బెట్... ఎక్కువేం కాదు
సాయి ధరమ్ తేజ రోజు రోజుకూ మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తొలి సినిమా రేయ్ ..ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత కుర్రాడు వెను తిరిగి చూసుకోలేదు. దానికి తోడు యంగ్ డైరక్టర్స్ అందరూ సాయి ధరమ్ తేజనే ఆప్షన్ గా పెట్టుకోవటం కూడా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ తాజా చిత్రం సుప్రీమ్ కు..గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రెండు కోట్లు కు వెళ్లాయని సమాచారం. గుంటూరు ఏరియాకు రెండు కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ వార్త విన్న వెంటనే అందరూ షాక్ అయ్యారు. అయితే రెండు కోట్లు పెట్టి తీసుకున్న వాళ్లు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
వాళ్లు చెప్పేదాని ప్రకారం సాయి ధరమ్ తేజ ఎబోవ్ యావరేజ్ చిత్రం కూడా 18 కోట్లు పైగా షేర్ తెచ్చి పెట్టింది. దాంతో ఇరవై కోట్లు పెట్టి తీసినా నష్టం లేదని అంటున్నారు. కంటెంట్ బలంగా ఉంటే దూసుకుపోతుందని నమ్మకంగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మాస్ లోకి బాగా దూసుకువెళ్లిన హీరో ఎవరూ అంటే సాయి ధరమ్ తేజే అని చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉండటంతో సాయి ధరమ్ తేజ కు తిరుగులేదు.